తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ కూడా గణపతిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. నాడు బ్రిటీష్ పాలనను అంతమొందించేందుకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బాలగంగాధర తిలక్ వినాయక నవరాత్రులను ప్రారంభించారని గుర్తు చేశారు. భారతీయులలో ఐక్యత తీసుకురావడానికి ఈ ఉత్సవాలను ఒక వేదికగా నాటి నాయకులు ఉపయోగించుకున్నారని, నేటికీ ఈ సంప్రదాయం మన సంస్కృతిలో ఒక భాగమై ఉందని తెలిపారు. ఇక ఈ సందర్భంగా మహా గణపతికి 21 కిలోల లడ్డూను, 110 అడుగుల కండువాను బీజేపీ నేతలు బహుకరించారు. కాగా దీనికి ముందు ఆయన ట్విట్టర్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ