దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,230 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,75,473 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (1223), తమిళనాడు (540), మహారాష్ట్ర (256), కర్ణాటక (195), ఒడిశా (164), వెస్ట్ బెంగాల్ (141), తెలంగాణ (94), ఉత్తరప్రదేశ్ (86), గుజరాత్ (85), ఛత్తీస్ గడ్ (82) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 32 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,562 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 42 వేలుకుపైగా (42,358 (0.10%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
217.82 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ:
కొత్తగా 4,255 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,40,04,553 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్ 27, మంగళవారం ఉదయం 7 గంటల వరకు 217.82 కోట్లకుపైగా (2,17,82,43,967) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 14,08,253 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY