ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 83,885 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3166 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో జూలై 7, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,231 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 21 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12919 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 4019 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 18,65,956 కు పెరిగింది. ప్రస్తుతం 32,356 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(3166):
- తూర్పుగోదావరి – 664
- పశ్చిమగోదావరి – 431
- ప్రకాశం – 375
- చిత్తూరు – 337
- నెల్లూరు – 259
- గుంటూరు – 239
- కడప – 221
- కృష్ణా – 191
- విశాఖపట్నం – 144
- శ్రీకాకుళం – 103
- అనంతపూర్ – 102
- విజయనగరం – 55
- కర్నూల్ – 45
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ