కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 16 కోట్లు దాటింది. 16 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేవలం 109 రోజుల్లోనే పంపిణీ చేసి, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ లక్ష్యం చేరుకున్న దేశంగా భారత్ నిలిచింది. అమెరికా 111 రోజుల్లో, చైనా 116 రోజుల్లో 16 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాయి. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మే 5, బుధవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 16 కోట్లు (16,04,94,188) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 109వ రోజైన మే 4, మంగళవారం నాడు 14 లక్షలకుపైగా (14,84,989) వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటిదాకా మొత్తం 12 రాష్ట్రాల్లో 18-44 సంవత్సరాల వయస్సు గల 6,71,285 మంది లబ్ధిదారులు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ