జనవరి 18వ తేదీన ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా భారీ బహిరంగ సభ జరగనుండగా, ఈ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్ పార్టీ నేత, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటుగా మరికొందరు కీలక జాతీయ నేతలు హాజరవనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామానాగేశ్వర్రావు, పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ కమల్రాజ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అలాగే సభ సంబంధిత అంశాలతో పాటుగా జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE