జనవరి 13వ తేదీ నుంచి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ, సోమవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు సీఎం కేసీఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించిన వారిలో ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈఓ నాగేశ్వర రావు, ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య, ప్రధాన అర్చకులు రవీందర్, విక్రంత్ జోషి, మధుకర్ శర్మ, పురుషోత్తమ శర్మ, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE