తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. 2023, ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
నూతనంగా నిర్మితమైన “డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం” ప్రారంభోత్సవాన్ని, సీఎం కేసీఆర్ జన్మదినం రోజైన ఫిబ్రవరి 17న, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరపాలని నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE