దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో కొత్తగా 113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 5, ఆదివారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,83,363 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక,, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,745 గా ఉంది.
అలాగే మరో 88 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,50,801 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం 1,817 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 1,32,649 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.09 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE