కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసులలో ఆకస్మిక పెరుగుదలను గుర్తించినట్టు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతమున్న యాక్టీవ్ కేసులలో 59 శాతం ఈ నాలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయన్నారు. టెస్టింగ్-ట్రాకింగ్-ట్రీట్మెంట్ వ్యూహాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ పంపిణి త్వరలో ప్రారంభం కానున్నప్పటికీ మాస్క్ ధరించడం సహా ఇతర అన్ని కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.
మరోవైపు కేరళలో 64447 యాక్టీవ్ కేసులు ఉండగా, మహారాష్ట్రలో 51111, ఛత్తీస్ గడ్ లో 8859, పశ్చిమబెంగాల్ లో 8476 ఉన్నాయి. అలాగే గత 7 రోజులలో కేరళ రాష్ట్రంలో రోజువారీ సగటు కేసులు 5023 కాగా, మహారాష్ట్రలో 3707, ఛత్తీస్ గడ్ లో 1006, పశ్చిమ బెంగాల్లో రోజువారీ సగటు కేసులు 908 గా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ