తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మార్చ్ 30 , సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం వివిధ రకాల వేతనాల చెల్లింపులలో కోత విధించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు కూడా వేతనాల్లో కోత వర్తిస్తుందని చెప్పారు. అలాగే మార్చ్ నెల నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కోత వివరాలు:
- ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు – 75%
- ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు – 60%
- మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగులు – 50%
- రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్ లలో – 50%
- నాల్గవ తరగతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాలలో 10% కోత.
[subscribe]