విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు,వెంకటకృష్ణ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు. మాదాపూర్ పోలీసుల సమాచారం ప్రకారం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణ రాత్రి 9 గంటల సమయంలో మీనాక్షి స్కైలాంజ్ వద్ద విధుల నిర్వహణలో ఉండగా, హైటెక్స్ కమాన్ వైపు నుంచి వస్తున్న వాహనాలను, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొద్ది సేపు ఆపాడు. నిబంధనలు అతిక్రమించి వెళ్తున్న కారును ఆపగా, కారులోంచి దిగిన వెంకటకృష్ణ ప్రసాద్ కానిస్టేబుల్ కృష్ణతో గొడవకు దిగాడు.
రోడ్డుపై జరుగుతున్న వాదన గురించి తెలుసుకొని, సమీప ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్రెడ్డి అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే కొడుకుని వారించే ప్రయత్నం చేయగా, వినకపోవడంతో స్టేషన్ కి రావాలని కోరాడు. స్టేషన్ కి రమ్మనడంతో ఆగ్రహించిన వెంకటకృష్ణ ప్రసాద్ ఇన్స్పెక్టర్ను పక్కకు నెట్టేసి, ఆయన్ని కాలుతో తన్ని దూషించాడు. మిగిలిన పోలీసుల సాయంతో, అతన్ని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కుమారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.
[subscribe]
[youtube_video videoid=OqtICs8PQb0]