కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్-4 మార్గదర్శకాలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్లు నడపడానికి అనుమతి ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరవడానికి కూడా అనుమతి ఇచ్చారు.
తెలంగాణలో అమలు కానున్న అన్లాక్-4 మార్గదర్శకాలు:
- పాఠశాలలు, విద్యా సంస్థలు, మరియు కోచింగ్ సంస్థలు, సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్, సంబంధిత ప్రదేశాలు తెరవడంపై నిషేధం.
- బార్లు, క్లబ్స్ మూసే ఉంటాయి, వాటిని తెరవడంపై ప్రత్యేక ఆదేశాలు జారీ అవుతాయి.
- ఆన్లైన్ తరగతులు నిర్వహణ, దూరవిద్య విధానానికి అనుమతి.
- సెప్టెంబర్ 21 నుండి కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాలలోని పాఠశాలకు 50% టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ఆన్లైన్ తరగతులు, సంబంధిత పనుల కోసం పాఠశాలకు హాజరయ్యేలా అనుమతి.
- సెప్టెంబర్ 21 నుండి కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల 9 నుండి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలకు ఉపాధ్యాయుల సూచనలతో, స్వచ్ఛంద ప్రాతిపదికన వెళ్లొచ్చు. ఇది కూడా తల్లిదండ్రులు/సంరక్షకుల వ్రాతపూర్వక సమ్మతికి లోబడి అనుమతించబడుతుంది.
- సెప్టెంబర్ 21 నుండి సాంఘిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కృతిక మరియు మతపరమైన సహా బహిరంగ సమావేశాలు 100 మందితో అనుమతించబడతాయి. ఈ సమావేశాల నిర్వహణలో ఫేస్ మాస్క్లు ధరించడం తప్పనిసరి, సామాజిక దూరం, థర్మల్ స్కానింగ్ మరియు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ల సదుపాయం తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
- సెప్టెంబర్ 7 నుంచి దశల వారీగా మెట్రో రైళ్ల సేవలు ప్రారంభం
- ఓపెన్ ఎయిర్ థియేటర్లు కూడా సెప్టెంబర్ 21 నుండి తెరవడానికి అనుమతించబడతాయి.
- రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు.
- 65 సంవత్సరాలు దాటిన పెద్దలు, అనారోగ్యంతో బాధపడేవారు, 10 సంవత్సరాల లోపు పిల్లలు అత్యవసర పరిస్థితులు, వైద్యం నిమిత్తం తప్ప బయటకురాకుండా ఇంట్లోనే ఉండాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu