తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. మొన్నటి వరకు డీలా పడిన కాంగ్రెస్.. ఇప్పుడు పుంజుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆ పార్టీకి మరింత ఊతమిచ్చాయి. అటు ఎస్సీ, ఎస్టీ, రైతు, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించినప్పటి నుంచి పార్టీకి ఆదరణ మరింత పెరిగింది. పార్టీ గ్రాఫ్ కూడా పుంజుకుంది. దీంతో అదే దిశగా జనాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో మరో రెండు డిక్లరేషన్లు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలవేళ బీసీలకు, మహిళలకు ప్రధాన్యత ఏర్పడింది. ప్రధాన పార్టీలన్నీ బీసీలను, మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అటు బీజేపీ బీసీలను, మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు వారికే ఎక్కువ టికెట్లను కట్టబెడుతోంది. అంతేకాకుండా బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెబుతోంది. అటు బీఆర్ఎస్ కూడా బీసీలకు, మహిళలకు అధిక ప్రధాన్యత ఇస్తూ ముందుకు కదులుతోంది.
ఈక్రమంలో కాంగ్రెస్లో కూడా బీసీలను, మహిళలను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీసీ, మహిళా డిక్లరేషన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీసీలు ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లాలో బీసీ డిక్లరేషన్ను.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో రిలీజ్ చేయించేందుకు టి.కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మహిళలా డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కొల్లపూర్లో విడుదల చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం సీనియర్లంతా అభ్యర్థులను ఎంపిక చేయడంలో.. అసంతృప్తులను సంతృప్తి పరచడంతో బిజీబిజీగా ఉన్నారు. తక్కువ సమయం మాత్రమే ఉండడంతో.. మహిళలు, బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ఏయో అంశాలను డిక్లరేషన్లో చేర్చాలన్నది టి.కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. మరి ఏయో అంశాలు డిక్లరేషన్లో ఉంటాయి?.. ఎస్టీ, ఎస్టీ, రైతు, మైనార్టీ డిక్లరేషన్లు జనాలను ఆకట్టుకున్నట్లుగానే.. మహిళా, బీసీ డిక్లరేషన్లు కూడా జనాలను ఆకట్టుకుంటాయా? లేదా? అనేది చర్చనీయాంశమయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ