కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ను మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోలీస్ శాఖ టాప్ -3 వ్యూహాన్ని సిద్ధం చేసింది. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తుండడం వలన ఈ త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయాలనీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
ముందుగా రాష్ట్రంలో ఎస్సై, సిఐ, డిఎస్పీ లేదా ఏసీపీ, ఎస్పీ లేదా డీసీపీ మరియు పోలీస్ కమిషనర్ల పరిధిలో ఉల్లంఘన కేసుల సంఖ్య, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి ఆయా ప్రాంతాలని టాప్-3 ప్రాంతాలుగా గుర్తిస్తారు. అనంతరం జనం రద్దీ, వాహనాలు రహదారులపైకి రావడానికి గల కారణాలను విశ్లేషిస్తారు. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు. అలాగే లాక్డౌన్ కారణంగా పోలీసులు విశ్రాంతి లేకుండా విధుల్లో పాల్గోంటునందువలన పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం టెలీ హెల్త్ కన్సల్టేషన్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
A 3-factor strategy. On observing few areas of #LockDown violations. Top-3 areas will b identified based on No.of violations encountered,CCTV footage will b analysed to #IdentifyRootCause,On which #PlanOfAction for execution.
* TeleHealthConsultation for #police has been started. pic.twitter.com/s6kVO8TgAB— DGP TELANGANA POLICE (@TelanganaDGP) April 10, 2020