తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 12, మేడ్చల్, నిజామాబాద్ లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872 కు చేరుకుంది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా, 186 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 663 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 21, మంగళవారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 35 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కర్నూల్ లో 10, గుంటూరులో 9, కడపలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, కృష్ణ మరియు అనంతపూర్ లలో మూడు కేసుల చొప్పున మొత్తం 35 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 757 కు పెరిగింది. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 22 మంది మృతి చెందగా, మరో 96 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం 639 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]