భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6,535 కరోనా పాజిటివ్ కేసులు, 146 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ పదో స్థానంలో నిలిచింది.
దేశంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,167 కి చేరింది. కరోనా బాధితుల్లో 60,491 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 80,722 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళ నాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 52,667 కు చేరగా, వీరిలో 15,786 మంది కోలుకున్నారు, 1695 మంది మరణించారు. ఇక ఇప్పటిదాకా తమిళనాడు లో 17,082, గుజరాత్ లో 14,468, ఢిల్లీలో 14,053 కేసులు నమోదు అయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu