ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2719 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 8,148 సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వలన తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 57 కి చేరింది. మరోవైపు 1903 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లోనే 55 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 759 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూర్ జిల్లాలో నలుగురు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినట్టుగా పేర్కొన్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 153 (మహారాష్ట్ర 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, తమిళనాడు 3, పశ్చిమ బెంగాల్ 1, కర్ణాటక 1) మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 47 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గత 24 గంటల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన 70 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. మరోవైపు విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 111 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. గత 24 గంటల్లోనే 49 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో కువైట్ నుండి వచ్చిన వారు 44, అబుధాబి నుంచి 3, ఖతార్ నుండి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు.
#COVIDUpdates: as on 26/05/2020 10:00AM
*Total registered cases in the state: 2719
*Discharged: 1903
*Deceased: 57
*Active Cases: 759#APFightsCorona pic.twitter.com/agbgDQTpLG— ArogyaAndhra (@ArogyaAndhra) May 26, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu