కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 4వ తేదీనుంచి గ్రీన్ జోన్స్ లలో అన్ని సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తూ, ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో గణనీయమైన మినహాయింపులు ఇచ్చారు. అయితే రెడ్ జోన్స్ లో మాత్రం కట్టుదిట్టంగా లాక్డౌన్ ను అమలు చేయాలనీ ఆదేశాలిచ్చారు.
దేశవ్యాప్తంగా ఆరెంజ్ జోన్స్ లలో సడలింపుల వివరాలు:
- ప్రయాణాలు -విమాన, రైళ్లు, మెట్రో: అనుమతి లేదు
- రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు బయటకు రావడం: అనుమతి లేదు
- 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పెద్దలు, పిల్లలు, పెగ్నెంట్స్ బయటికి రావడం: అనుమతి లేదు
- అంతర్ రాష్ట్ర ప్రయాణం: అనుమతి లేదు
- విద్యాసంస్థలు: అనుమతి లేదు
- హోటల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్: అనుమతి లేదు
- సభలు, సామూహిక మత ప్రార్ధనలు: అనుమతి లేదు
- బార్బర్ షాప్స్, సెలూన్స్, స్పాస్: అనుమతి ఉంది
- మద్యం, పాన్ షాప్స్: అనుమతి ఉంది
- ఆటో మరియు టాక్సీ: డ్రైవర్ సహా ఒకరికి అనుమతి ఉంది.
- జిల్లాల మధ్య బస్సు సేవలు: 50 %ప్రయాణికులతో అనుమతి ఉంది
- జిల్లాలో బస్సు సేవలు: 50 %ప్రయాణికులతో అనుమతి ఉంది
- 4 – వీలర్: డ్రైవర్ సహా ఇద్దరు ప్రయాణికులు
- 2 – వీలర్: డ్రైవర్ సహా ఒకరికి అనుమతి ఉంది.
- మెడికల్ క్లినిక్, ఓపీడీ: అనుమతి ఉంది
- వ్యవసాయ కార్యకలాపాలు: అనుమతి ఉంది
- ప్రైవేట్ అండ్ ప్రభుత్వం ( నాన్ కోర్) సేవలు: అనుమతి ఉంది
- పరిశ్రమలకు అనుమతి: అనుమతి ఉంది
- అర్బన్ ఇండస్ట్రీస్: అనుమతి ఉంది
- అర్బన్ ప్రాంతాల్లో నిర్మాణాలు: అనుమతి ఉంది
- ఈ-కామర్స్ ఎసెన్షియల్ గూడ్స్: అనుమతి ఉంది
- సరుకు రవాణా: అనుమతి ఉంది
- పోస్టల్ మరియు కొరియర్ సేవలు: అనుమతి ఉంది
- అర్బన్ ప్రాంతాల్లో సింగిల్ నాన్ ఎసెన్షియల్/ ఎసెన్షియల్ షాపులు: అనుమతి ఉంది
- బ్యాంక్స్ మరియు ఫైనాన్స్ సంస్థల సేవలు: అనుమతి ఉంది
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu