మే 29, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. అలాగే మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ వేణు, ఇతర జిల్లా శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో చేస్తున్న ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే దిశగా అధికారులుకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu