వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 మందికి నోటీసుల జారీ చేసింది. ఇటీవల డాక్టర్ సుధాకర్ కేసుతో సహా పలు ఇతర అంశాల తీర్పులపై కొంతమంది న్యాయమూర్తులను ఉద్దేశపూర్వకంగా కించపరిచారంటూ లక్ష్మీనారాయణ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో, టీవీ చర్చ వేదికల్లో పలువురు కోర్టు తీర్పులపై చేసిన వ్యాఖ్యలను కోర్టు పరిశీలించింది. అనంతరం కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని తప్పుబడుతూ ఈ అంశానికి సంబంధించి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా మొత్తం 49 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu