ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే వుంది. మే 12, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కొత్తగా చిత్తూరులో 10, కర్నూల్, నెల్లూరు జిల్లాలో 9 చొప్పున, కృష్ణా జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో ఒక కేసుతో కలిపి మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే చిత్తూరు జిల్లాలో నమోదైన 10, నెల్లూరులో 9, తూర్పుగోదావరిలో నమోదైన ఒక కేసుతో కలిపి మొత్తం 20 పాజిటివ్ కేసులు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా పేర్కొన్నారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 46 మంది మృతి చెందగా, మరో 1056 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం 949 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 11, సోమవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా ఒక్కరోజే జీహెఛ్ఎంసీ ఏరియాలో 79 కేసులు నమోదయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది మృతి చెందగా, 801 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 444 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2051 పాజిటివ్ కేసు లకు గాను 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 949. #APFightsCorona pic.twitter.com/Zv2W4Chidj— ArogyaAndhra (@ArogyaAndhra) May 12, 2020
Media bulletin
Date: May 11, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/NrEDKycKXl
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 11, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu