తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి (మే 12, మంగళవారం) ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ముందుగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, అనంతరం మొదటి సంవత్సరం పరీక్షల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయనున్నారు. ఇంటర్ రెండు సంవత్సరాలకు సంబంధించి మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 15వేల మందికి పైగా అధ్యాపకులు ఈ వాల్యుయేషన్ లో పాల్గొననున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధ్యాపకులుకు అన్ని సదుపాయాలు కల్పించి, విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వాల్యుయేషన్ కు హాజరయ్యే వారికీ రవాణా, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మాస్క్లు, శానిటైజర్లు, పాస్లు అందజేస్తున్నట్టు తెలిపారు. వాల్యుయేషన్ జరిగే కేంద్రాల్లో ప్రతి రోజూ శానిటైజేషన్ చేసి ఫాగింగ్ చేపట్టనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]