ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింత ప్రభావం చూపుతుంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 161 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 41 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 8 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 161 కేసులతో కలిపి జూన్ 6, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3588 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 12771 సాంపిల్స్ ని పరీక్షించగా 161 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ వలన 73 మంది మరణించారు. మరోవైపు రాష్ట్రంలో 2323 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1192 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 741 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 467 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 131 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 127 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 872 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4460 కి చేరింది.
— ArogyaAndhra (@ArogyaAndhra) June 6, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu