ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో జూన్ 9న తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ కు అనుమతి, థియేటర్స్ తెరవడం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సినీ నిర్మాత సి.కళ్యాణ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జూన్ 9, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్తో భేటీ కానున్నామని, ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో సహా టాలీవుడ్కు చెందిన దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు అందరినీ ఆహ్వానించామని చెప్పారు. కాగా జూన్ 10న పుట్టిన రోజు వేడుకల వలన ఈ భేటీకి హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపారని సి.కల్యాణ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu