ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 147 కేసులతో కలిపి జూన్ 9, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3990 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 15085 సాంపిల్స్ ని పరీక్షించగా 147 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే కొవిడ్ వలన కృష్ణా, అనంతపూర్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించగా, ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 77 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో 2403 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 16 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1510 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 907 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 553 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 132 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 114 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 1032 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 5029 కి చేరింది.
— ArogyaAndhra (@ArogyaAndhra) June 9, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu