ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 22, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2514 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 8,415 సాంపిల్స్ ని పరీక్షించగా 62 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. మరోవైపు 1731 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లోనే 51 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 728 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసు లకు గాను 1731 మంది డిశ్చార్జ్ కాగా, 55 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 728.#APFightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]