భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6088 కరోనా పాజిటివ్ కేసులు, 148 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మే 22, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,18,447 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3583 కి చేరింది. కరోనా బాధితుల్లో 48,534 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 66,330 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 2.94 శాతం ఐసీయూలలో చికిత్స పొందుతుండగా, మరోవైపు బాధితుల రికవరీ రేటు కూడా దాదాపు 40 శాతం ఉందని వెల్లడించారు. అలాగే దేశంలో 555 టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని, గత కొన్ని రోజులుగా రోజుకు లక్షకు పైగా సాంపిల్స్ పరీక్షా చేస్తునట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu