ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌, పాల్గొన్న సీఎం జగన్

74rd Republic Day Celebrations in AP Governor Biswabhusan Harichandan Unfurls National Flag, CM Jagan Attends,74rd Republic Day Celebrations in AP,Governor Biswabhusan Harichandan, Unfurls National Flag, CM Jagan Attends,Mango News,Mango News Telugu,Republic Day,Decision on Republic Day Celebrations,Telangana Government's Decision,Republic Day Celebrations,Will Be Taken Into Consideration By The Central,Governor Tamilisai,Republic Day In India,Republic Day In Telangana,India Republic Day 2023,First Republic Day Of India,Republic Day Celebration In Hyderabad,Republic Day Events In Hyderabad,Republic Day Celebrations In India

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు గొప్పగా ఉన్నాయన్నారు. ప్రజలకు మేలు జరిగేలా డీబీటీ ద్వారా నవరత్నాలు అమలు జరుగుతున్నాయన్నారు. అమ్మ ఒడి సహా జగనన్న గోరు ముద్దు ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం, జగనన్న కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ కిట్ మరియు రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి సీబీఎస్ఈ సిలబస్ తో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కింద రూ.2750 సాయం అందిస్తున్నదని, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు సహా అనేక పథకాలు రైతుల సంక్షేమం కోసం అమలతున్నాయని చెప్పారు. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. మరోవైపు గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ హైటీ/తేనేటి విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు హాజరు కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =