74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం అమర జవానుల త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE