ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై 10 వ తేదీ నుంచి జూలై 15 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహణ అంశంపై గురు, శుక్రవారం నాడు సమావేశాలు నిర్వహించిన ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి నేడో, రేపో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలుతో పాటుగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 6,30,804 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని జూలై 10 నుంచి యధాతధంగా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతారా లేదా ఇతర రాష్ట్రాల బాటలోనే వెళ్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu