విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు. విశాఖపట్నంతో పాటు గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చని తెలిపారు. ఆరోగ్య శ్రీ తో అనుసంధానం అయిన హాస్పిటల్స్ తో పాటు, అనుసంధానం కాని హాస్పటల్స్ కు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అన్ని ఆస్పత్రులకు ఈ సమాచారాన్ని అందజేసినట్లు తెలిపారు. గ్యాస్ బాధితులుకు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స నిర్వహించినపుడు ఆ సంబంధిత హాస్పిటల్ వారు సదరు పేషెంట్ కు సంబందించిన వారి ఆధార్ కార్డ్, ఇతర వివరాలను తీసుకొని చికిత్స అనంతరం వైద్య సేవల బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి పంపాల్సి ఉంటుందని చెప్పారు. వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా చెల్లించాలని, దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదని అన్నారు. ప్రమాదవశాత్తు లీకైన గ్యాస్ వల్ల ప్రజలు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా సత్వర వైద్య సేవలు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విశాఖ నగరంలోని గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వెంటనే సమీపంలోని గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా ఎటువంటి వైద్య ఖర్చులు చెల్లించకుండానే ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందవచ్చు. తదుపరి సహాయం కొరకు ఆరోగ్యశ్రీ (విశాఖపట్నం) హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించగలరని కోరారు. డా. డి. భాస్కర రావు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త +91- 8333814019 నెంబర్ ను ప్రకటనలో పొందుపరిచారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu