ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1051 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 9, విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. కొత్తగా నమోదైన 1062 కేసులతో కలిపి జూలై 8, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22259 కు చేరింది. గత 24 గంటల్లో 27,643 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన కర్నూల్ లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, గుంటూరులో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 264 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 8, ఉదయం 10 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 22259
కొత్తగా నమోదైన కేసులు : 1062
నమోదైన మరణాలు : 12
డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 11101
యాక్టీవ్ కేసులు : 10894
మొత్తం మరణాల సంఖ్య : 264
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu