కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని ఆయన అన్నారు. ‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా మంగళవారం ఏపీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని అమరావతి ప్రాంత రైతులు కలిశారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సహకరించాలని నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాము స్వచ్చందంగా భూములు ఇచ్చామని, అయితే 2019 ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులంటూ కొత్తగా ప్రకటన చేసిందని రాహుల్ దృష్టికి తెచ్చారు. దీనిపై తాము న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని, తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అమరావతి రైతుల చేసిన విన్నపంపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంత రైతుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారికి సంఘీభావంగా కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో కూడా పాల్గొంటానని హామీ ఇచ్చారు. అలాగే అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున న్యాయపరమైన సాయం అందిస్తామని కూడా రాహుల్ చెప్పారు. ఇక పోలవరం నిర్వాసిత రైతులు కూడా రాహుల్ ని కలిశారు. ఈ సందర్భంగా.. పోలవరం నిర్వాసిత రైతులకు అండగా ఉంటానని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుచేసేలా చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY