రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతుంటే మురిసిపోయేవారు. “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటే ఇక మా కష్టాలు తీరిపోయినట్లే అని సంబరపడిపోయేవారు. ఓటు మీద ఓట్లు గుద్ది అందలం ఎక్కించేసేవారు. అలా అందలం ఎక్కిన నాయకుల్లో చాలామంది తమ అభివృద్ధిని చూసుకున్నారే కానీ.. ప్రజల అభివృద్ధిని పట్టించుకునేవాళ్లు లేరనే వాస్తవం సామాన్యులు కూడా గ్రహించినట్లున్నారు. అందుకే.. ఇప్పుడు అంత ఈజీగా ఎవరి మాటలకూ పడిపోవడం లేదు. “మరో చాన్స్” ఇచ్చేందుకు “సిద్ధం”గానూ లేరు. ఆ విషయం గుంటూరు పార్లమెంట్ పరిధిలో అయితే.. స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ పార్లమెంట్ పరిధిలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం కూటమి నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు. అధికార పార్టీ వైసీపీ నుంచి కిలారి రోశయ్య పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కిలారి.. ఈసారి ఎంపీ సీటుపై కన్నేశారు. తమ అధినేత జగన్ బటన్ నొక్కుతూ.. ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ చేస్తుండడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తూ కిలారి.. ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. మొదట్లో సాఫ్ట్ గా.. గుంటూరు పార్లమెంట్ రాజకీయాల్లో “తొలి అడుగులు ” మొదలుపెట్టిన పెమ్మసాని.. కొంచెం కొంచెం బీటు పెంచుతూ.. ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. “ఆయన కిలారి రోశయ్య కాదు.. కిలాడీ రోశయ్య ” అంటూ పొన్నూరు ఎమ్మెల్యేగా రోశయ్య చేసిన అక్రమాలను స్వయంగా వెలుగులోకి తెస్తున్నారు. లెక్కలతో సహా ఆయన అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచుతున్నారు.
“ఛ.. గుంటూరు పార్లమెంట్లో రమణను మార్చి తప్పుచేశారు. ” అని సొంత పార్టీ వైసీపీ కార్యకర్తలే చర్చించుకునేలా.. డాక్టర్ పెమ్మసాని రోశయ్య అక్రమాలను బహిర్గతం చేస్తున్నారు. “వామ్మో.. ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే.. అన్ని వేల కోట్లు దోచేసారా.. ఇక ఎంపీ అయితే ఏమైనా ఉందా..?”. అంటూ రోశయ్యపై చర్చోపచర్చలు జరిగేలా చేయడంలో పెమ్మసాని సక్సెస్ అయ్యారు. అంతేకాదు.. డాక్టర్.. రీడర్ గా మారి.. ప్రత్యర్థి చేసిన అక్రమాల చిట్టాను ఎన్నికల ప్రచారం లో వరుసగా చదువుతూ ఉంటే.. రోశయ్యకు చమటలు పడుతున్నాయట. వైసీపీ ఎంపీ అభ్యర్థి.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలను తెలుసుకుంటున్న ప్రజలు నోరెళ్లబెడుతున్నారట. ఇదేక్రమంలో మరి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి ఏమైనా పెద్ద నిజాయితీ పరుడా.. అని పెమ్మసాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గొప్పోన్ని.. మంచోడ్ని.. అని ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడం మామూలే అని తెలివిగా ఆలోచిస్తున్న ప్రజలు.. పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్న మాటలను పక్కన ఉంచి.. స్వయంగా పరిశీలిస్తున్నారు. అలా తెలుసుకుంటున్న వారు.. నిజాయితీగా, ఆర్థికంగా పెమ్మసాని ఎదిగిన తీరు.. ఇప్పటికే చేస్తున్న సేవాకార్యక్రమాలు.. పరుల కోసం సొంత సొమ్ము వెచ్చిస్తుండడంతో “ఎస్.. హీ ఈజ్ ద హానెస్ట్ లీడర్.. ” అని పెమ్మసానిని నమ్మతుండడం గమనార్హం.
ఉన్నదాంట్లో ప్రజల కోసం అంతో.. ఇంతో.. ఖర్చు చేసేవాడైతేనే.. ప్రజల, పార్లమెంట్ అభివృద్ధికి ప్రభుత్వ సొమ్మును పూర్తిగా వెచ్చిస్తాడన్న నమ్మకం.. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్పై గుంటూరు ప్రజలకు కలిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో.. పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ జోరు ప్రదర్శించడం కచ్చితమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY