ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1248 కరోనా పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 24, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,04,590 కు, మరణాల సంఖ్య 13,750 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,715 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,77,163 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1248):
- పశ్చిమగోదావరి – 238
- చిత్తూరు – 166
- కృష్ణా – 148
- గుంటూరు – 130
- నెల్లూరు – 120
- ప్రకాశం – 118
- శ్రీకాకుళం – 75
- విశాఖపట్నం – 67
- తూర్పుగోదావరి – 66
- విజయనగరం – 45
- అనంతపూర్ – 31
- కర్నూల్ – 25
- కడప – 19
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ