ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్ దేశంలో ఏర్పడ్డ తాజా పరిణామాలపై కీలకంగా చర్చించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఆఫ్ఘానిస్తాన్ లో ఇటీవల పరిణామాలపై నా స్నేహితుడు ప్రెసిడెంట్ పుతిన్ తో వివరణాత్మక మరియు ఉపయోగకరమైన అభిప్రాయాల మార్పిడి జరిగింది. అలాగే ద్వైపాక్షిక ఎజెండాతో పాటుగా కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారత్-రష్యా సహకారం వంటి అంశాలను కూడా మేము చర్చించాము. ముఖ్యమైన సమస్యలపై సన్నిహిత సంప్రదింపులు కొనసాగించడానికి మేము పరస్పరం అంగీకారం తెలుపుకున్నాం.” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ