ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,376 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,908 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 438, చిత్తూరులో 231, గుంటూరులో 216, నెల్లూరులో 213, కృష్ణాలో 192, ప్రకాశంలో 186 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,80,258 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 23 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు , తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13513 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,908 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,46,370 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ