ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,540 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 53, తూర్పుగోదావరిలో 37, విశాఖపట్నంలో 36, కృష్ణాలో 34, పశ్చిమగోదావరిలో 33, గుంటూరులో 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,352 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 3 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14409 కి పెరిగింది. గత 24 గంటల్లో 307 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,51,747 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,196 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ