ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 35,054 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 67, తూర్పుగోదావరిలో 48, పశ్చిమగోదావరిలో 45, గుంటూరులో 43, కృష్ణాలో 35, విశాఖపట్నంలో 31 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,065 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 2 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14369 కి పెరిగింది. గత 24 గంటల్లో 535 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,47,047 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,649 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ