ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ప్రధాని మోదీ వాటికన్ సిటీలో క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని మరియు పోప్ల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో ప్రధానితో పాటుగా కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురూ కోవిడ్-19 మహమ్మారి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై దాని పర్యవసానాలపై చర్చించినట్టు తెలిపారు.
అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల ఎదురవుతున్న సవాల్పైనా చర్చించారు. క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి, 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రధాని పోప్కు వివరించారు. ఈ మహమ్మారి సమయంలో అవసరమైన దేశాలకు భారత్ చేస్తున్న సహాయాన్ని పోప్ ప్రశంసించారు. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ కు భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అందించారు. ప్రధాని ఆహ్వానాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆనందంతో అంగీకరించినట్టుగా పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ