ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 434 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 5, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,376 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణం సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,499 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 102 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,62,029 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
మరోవైపు ఏపీలో కొత్తగా నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరినట్టు ఏపీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రకటన చేశారు. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన వ్యక్తుల ఆరోగ్యం స్థిరంగా ఉందని, అందరూ ఐసోలేషన్ లో ఉన్నారన్నారు. అలాగే వీరందరి కాంటాక్ట్ వ్యక్తులను ట్రేస్ చేసి, పరీక్షలు నిర్వహించామని, పాజిటివ్ గా తేలిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు తెలిపారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(434):
- చిత్తూరు – 68
- విశాఖపట్నం – 63
- కృష్ణా – 61
- గుంటూరు – 45
- విజయనగరం – 39
- తూర్పుగోదావరి – 34
- పశ్చిమగోదావరి – 30
- నెల్లూరు – 30
- అనంతపూర్ – 27
- కడప – 13
- శ్రీకాకుళం – 9
- కర్నూల్ – 8
- ప్రకాశం – 7
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ