ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దగ్గరి బంధువు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్కుమార్ రెడ్డి కుమారుడు వివాహానికి హాజరవుతారని చెప్పారు. అయితే వివాహం 17వ తేదీన జరుగనుందని, కానీ సీఎం జగన్ మాత్రం 16వ తేదీనే కర్నూలు చేరుకుంటారని కలెక్టర్ తెలియజేశారు. కృష్ణానగర్లోని స్థానిక ఎమ్మెల్యే నివాసాయానికి చేరుకొని అక్కడే నూతన వధూవరులను ఆశీర్వదిస్తారన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనపై మంగళవారం కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులతో కాన్ఫరెన్స్ హాలులో కీలక సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పర్యటన పూర్తయ్యేవరకు అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం జగన్ 16న నేరుగా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తారని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బెటాలియన్ చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కృష్ణానగర్లోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకొంటారని తెలిపారు. అక్కడ కొంత సమయం వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఉదయం 10.40 నుంచి 01.05 గంటల వరకు కర్నూలు పట్టణంలో గడుపుతారని వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై నిర్వహించిన ఈ సమీక్షలో జేసీ ఎస్.రామసుందర్రెడ్డి, డీఆర్ఓ ఎస్వీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ