ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 91,677 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2665 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో జూలై 11, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,22,843 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 16 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 13002 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 3231 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 18,81,161 కు పెరిగింది. ప్రస్తుతం 28,680 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(2665):
- తూర్పుగోదావరి – 529
- చిత్తూరు – 353
- పశ్చిమగోదావరి – 293
- ప్రకాశం – 285
- కృష్ణా – 281
- గుంటూరు – 223
- నెల్లూరు – 195
- కడప – 161
- విశాఖపట్నం – 112
- అనంతపూర్ – 106
- శ్రీకాకుళం – 56
- విజయనగరం – 38
- కర్నూల్ – 33
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ