ఎన్నికలవేళ ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తమ బలాన్ని.. బలగాన్ని మరింత పెంచుకునేందుకు పక్క పార్టీల నేతలకు గాలాలు వేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లను మార్చేస్తుండడంతో.. అసంతృప్తులంతా ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. మరోవైపు తెలుగు దేశం పార్టీ నుంచి కూడా వైసీపీలోకి వెళ్తున్న వారు కూడా ఉన్నారు.
ఇప్పటికే కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు మరో టీడీపీ ఎంపీ కూడా ఆయన బాటలోనే వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ పార్టీకి టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 2014లో మొదటిసారి గల్లా జయదేవ్ తెలుగు దేశం పార్టీ తరుపున గుంటూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో కూడా టీడీపీ గుంటూరు టికెట్ ఆయనకే ఇచ్చింది. ఈసారి కూడా జయదేవ్ గెలుపొంది రెండోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.
అయితే కొద్దిరోజులుగా జయదేవ్ తెలుగు దేశం పార్టీ హైకమాండ్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ వ్యవహారాలు.. పార్టీ కార్యక్రమాల పట్ల అంటీ అంటనట్లు వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో కొద్దిరోజులుగా జయదేవ్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆయన మాత్రం సైలెంట్గానే ఉన్నారు. అయితే టీడీపీలో జయదేవ్ అసంతృప్తిగా ఉన్నారని తెలిసి.. తమ వైపుకు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. గతంలో కూడా ఓసారి వైసీపీకి జయదేవ్కు టచ్లోకి వెళ్లింది.
తాజాగా గల్లా జయదేవ్తో వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సమావేశం అయినట్లు తెలుస్తోంది. గల్లాను భాస్కర రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారట. అటు గల్లా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే గల్లా జయదేవ్.. జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా నిజంగానే గల్లా జయదేవ వైసీపీలోకి వెళ్తారా..? వెళ్తే ఆయన్ను వైసీపీ హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE