ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గానూ మార్చి 11 లేదా 14న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తునట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ఏయే ఏయే అంశాలను చర్చించాలో నిర్ణయించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ