ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షనేత అచ్చెంనాయడు, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, చీఫ్ విప్ ప్రసాదరాజు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. కాగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు దినాలు కలుపుకొని మార్చి 14వ తేదీ నుండి మార్చి 24 వరకు సమావేశాలు జరగనున్నాయి.
రాష్ట్ర బడ్జెట్ను మార్చి 16న సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా మార్చి 15, బుధవారం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా మార్చి 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవులు ఉండనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE