ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై 19 తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది. జూలై 19 నుంచి 23 వరకు ఐదురోజుల పాటుగా సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు జూలై 18వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. శాసన సభ సమావేశాల ఎజెండా, ప్రవేశపెట్టే కీలక బిల్లులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు వంటి అంశాలపై కసరత్తు జరుగుతుండగా, ఖరారు చేయాల్సి ఉంది. అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ పై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY