ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగా కొనసాగాయి. రెండో రోజు సభలో టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణం, ఆక్వా బిల్లు సహా పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఓదశలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని, సభలో హుందాగా నడుచుకోవాలని హితవు పలికారు. అనంతరం కూడా సభలో వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారని 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటుగా సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా సభ బయటకు వెళ్లారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల మొదటిరోజున కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ