జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్ పక్రియ

GHMC Elections: Polling Process Completed In 149 Divisions,GHMC Elections,GHMC Elections 2020,GHMC Elections 2020 Latest News,GHMC Elections 2020 Updates,GHMC Elections Latest Updates,GHMC Elections Voting,GHMC Polling Updates,GHMC Polls,Mango News,#GHMCElections2020,GHMC Elections News,GHMC Polling Process Completed In 149 Divisions,GHMC Polls 2020,GHMC Elections Polling Process Completed,GHMC Polling Process Completed,GHMC Elections 149 Divisions,Mango News Telugu,GHMC Polling Process In 149 Divisions

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అలాగే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం కల్పించారు. అయితే పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. సాయంత్రం 5 గంటల వరకు 36.73% పోలింగ్‌ నమోదైంది. పోలింగ్ ముగియడంతో పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. బాగ్ అంబర్ పేట డివిజన్ లో అత్యధికంగా 64.80 శాతం పోలింగ్ నమోదవగా, లంగర్ హౌస్ లో అత్యల్పంగా 6.78 శాతం నమోదైనట్లు తెలుస్తుంది.

జీహెచ్‌ఎంసీలో ఈ రోజు 149 డివిజన్లలో పోలింగ్ జరగగా అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒక్క ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజ‌న్‌లో మాత్రమే పోలింగ్ రద్దయింది. ఆ డివిజన్ లో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్య‌ర్థుల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ ను రద్దు చేశారు. దీంతో ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 3 న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =