గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అలాగే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం కల్పించారు. అయితే పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. సాయంత్రం 5 గంటల వరకు 36.73% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. బాగ్ అంబర్ పేట డివిజన్ లో అత్యధికంగా 64.80 శాతం పోలింగ్ నమోదవగా, లంగర్ హౌస్ లో అత్యల్పంగా 6.78 శాతం నమోదైనట్లు తెలుస్తుంది.
జీహెచ్ఎంసీలో ఈ రోజు 149 డివిజన్లలో పోలింగ్ జరగగా అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒక్క ఓల్డ్ మలక్పేట డివిజన్లో మాత్రమే పోలింగ్ రద్దయింది. ఆ డివిజన్ లో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ ను రద్దు చేశారు. దీంతో ఓల్డ్ మలక్పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 3 న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ