ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి శుక్రవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. కాగా సమావేశాలు రెండో రోజున సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో మంత్రులు సంబంధిత అంశాలపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించగా, మరోవైపు ధరల పెరుగుదలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
అయితే స్పీకర్ తమ్మినేని దీనికి అంగీకరించకపోవడంతో పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. ఎంత చెప్పినా వినకుండా పదేపదే ఇలా ప్రవర్తించడం బాగాలేదని, సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు. సభా సమయం వృధా అవుతుందని, సభకు సహకరించాలని వారిని కోరారు. అయినా టీడీపీ సభ్యులు తమ నినాదాలను కొనసాగిస్తుండటంతో వారిపై స్పీకర్ తమ్మినేని సీతారాం తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సభ నుండి సస్పెండ్ చేశారు. కాగా గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున కూడా టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY